డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..పలు వాహనాలు దగ్ధం..!!
- June 11, 2026
మనామా: బహ్రెయిన్పై ఇరాన్ డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. హమద్ టౌన్ మరియు మనామాలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, గాయపడిన బాలికకు సంఘటనా స్థలంలో చికిత్స అందించినట్లు, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పుతున్న ఫోటోలను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
అంతకుముందు, బహ్రెయిన్, కువైట్ మరియు జోర్డాన్లోని యుఎస్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే, బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు వాటిని మధ్యలోనే విజయవంతంగా అడ్డగించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అయినప్పటికీ కొన్ని డ్రోన్ ల శిధిలాలు నివాస ప్రాంతాల్లో పడటంతో నష్టం కలిగిందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్లో ట్రాఫిక్కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!







