డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..పలు వాహనాలు దగ్ధం..!!
- June 11, 2026
మనామా: బహ్రెయిన్పై ఇరాన్ డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. హమద్ టౌన్ మరియు మనామాలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, గాయపడిన బాలికకు సంఘటనా స్థలంలో చికిత్స అందించినట్లు, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పుతున్న ఫోటోలను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
అంతకుముందు, బహ్రెయిన్, కువైట్ మరియు జోర్డాన్లోని యుఎస్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే, బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు వాటిని మధ్యలోనే విజయవంతంగా అడ్డగించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అయినప్పటికీ కొన్ని డ్రోన్ ల శిధిలాలు నివాస ప్రాంతాల్లో పడటంతో నష్టం కలిగిందన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం
- ఏపీ ప్రభుత్వం జొమాటోకు రూ.9.63 కోట్ల ఫైన్!
- GHIAL తెలంగాణ ప్రభుత్వానికి ₹12.28 కోట్ల డివిడెండ్ చెల్లింపు
- మినీబస్–ట్రక్ ప్రమాద బాధితులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు..
- మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
- ఒమన్ తీరంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి..!!









