క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలతో ఎగుమతులు పునఃప్రారంభం..!!
- June 11, 2026
రియాద్: లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ మరియు ప్రధానమంత్రి నవాఫ్ సలాం అభ్యర్థన మేరకు, సౌదీ అరేబియాకు లెబనీస్ ఎగుమతులను పునఃప్రారంభించాలని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించారు. రాష్ట్ర సంస్థలను పునర్నిర్మించడానికి లెబనీస్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్యలు, గత ఏడాదిగా ప్రత్యేక బృందాలు సాధించిన పురోగతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో సౌదీ పేర్కొంది.
లెబనీస్ ప్రధానమంత్రి నవాఫ్ సలాంతో విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బుధవారం టెలిఫోన్ కాల్ సందర్భంగా ఈ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పొరుగు దేశాలకు హాని కలిగించే వేదికగా దేశాన్ని ఉపయోగించకుండా నిరోధించడానికి లెబనీస్ అధికారులు అవసరమైన చర్యలను కొనసాగిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియా మరియు లెబనాన్ మధ్య ఉన్న సంబంధాలకు, అలాగే లెబనాన్ పునరుద్ధరణ ప్రయత్నాలకు సౌదీ అరేబియా అందిస్తున్న నిరంతర మద్దతుకు ఈ చర్య నిదర్శనమని క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు లేబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ నిర్ణయం లెబనాన్ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన ఊపునిస్తుందని, అలాగే లెబనీస్ ఉత్పత్తిదారులు మరియు ఎగుమతిదారులలోని విస్తృత వర్గానికి మద్దతు ఇస్తుందని అన్నారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సంబంధాన్ని బలోపేతం చేసే దిశగా ఈ చర్యను లెబనీస్ ప్రజలు ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారని ఔన్ తెలిపారు.
లెబనాన్ ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయడం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన చారిత్రక సంబంధాలను ప్రతిబింబిస్తుందని, అలాగే లెబనాన్పై సౌదీ అరేబియాకు ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తుందని ప్రధానమంత్రి నవాఫ్ సలాం అన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం
- ఏపీ ప్రభుత్వం జొమాటోకు రూ.9.63 కోట్ల ఫైన్!
- GHIAL తెలంగాణ ప్రభుత్వానికి ₹12.28 కోట్ల డివిడెండ్ చెల్లింపు
- మినీబస్–ట్రక్ ప్రమాద బాధితులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు..
- మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
- ఒమన్ తీరంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి..!!









