హైమా ప్రమాదంలో ఐదుగురి మృతి
- August 09, 2016
నలుగురు ఒమనియన్లు, ఒక ఇతియోపియన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం, కార్గోట్రక్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ హైమా, అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చనిపోయినవారిలో నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు. మరో వ్యక్తి, ఆ కుటుంబానికి హౌస్మెయిడ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వేగంగా వెళుతున్న కారు ప్రమాదానికి గురవడానికి గల కారణాల్ని చెబుతూ, ఆ సమయంలో కారు టైర్ పేలడంతో, అది అదుపుతప్పి కార్గో ట్రక్ని ఢీకొన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద స్థలంలోనే అందరూ మృతి చెందారు. చనిపోయినవారిలో 14 ఏళ్ళలోపు చిన్నారులు ఇద్దరు ఉన్నారు. ట్రక్ డ్రైవర్ మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డాడు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







