AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- June 14, 2026
దోహా: AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఖతార్ సివిల్ సర్వీస్ మరియు ప్రభుత్వ అభివృద్ధి బ్యూరో (CGB) 'ప్రాజెక్ట్ మేనేజర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అనే పేరుతో ఒక ప్రత్యేక శిక్షణా వర్క్షాప్ను నిర్వహించింది. సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ (MCIT) సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం.. వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ప్రాజెక్ట్ నిర్వహణలో అత్యాధునిక నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నారు.
ప్రాజెక్ట్ నిర్వహణ రంగాన్ని వేగంగా మారుస్తున్న AI గురించి పాల్గొనేవారు లోతుగా తెలుసుకునేందుకు వీలుగా శిక్షణను అందించనున్నారు. ఆధునిక ప్రాజెక్ట్ నిర్వహణలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంపై ఈ శిక్షణ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సంక్లిష్టమైన డేటాసెట్లను విశ్లేషించడానికి బిగ్ డేటా మరియు ఏఐ అల్గారిథమ్లను ఉపయోగించుకునే పద్ధతులను పరిచయం చేస్తారు. ఈ విధానం ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలులో సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను పెంపొందిస్తుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలలో రోజువారీ కార్యకలాపాలలో ఏఐ (AI) పరిష్కారాలను అనుసంధానించడం ద్వారా.. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ పనులను మరింత సమర్థవంతంగా చేస్తారని సీజీబీ తెలిపింది.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







