యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- June 14, 2026
యూఏఈ: యూఏఈ మరియు ఖతార్ లు లక్ష్యంగా తప్పుదోవ పట్టించే మీడియా కథనాలను అరబ్ పార్లమెంట్ మరియు గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ప్రాంతీయ స్థిరత్వం, శాంతి స్థాపన మరియు అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తాయని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి.
యూఏఈ మరియు ఖతార్లను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వక మీడియా ఆరోపణలను మరియు ఆధారాలు లేని సమాచారాన్ని జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్బుదైవి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో వారి నిర్మాణాత్మక పాత్రపై సందేహాలు కలిగించేలా ఉన్నాయని అన్నారు.
ఈ సందర్భంగా జీసీసీ, అరబ్ పార్లమెంట్ యూఏఈ మరియు ఖతార్లకు తమ మద్దతును పునరుద్ఘాటించాయి. ప్రాంతీయ స్థిరత్వం లేదా దౌత్య సంబంధాలను దెబ్బతీసేలా ధృవీకరించని కథనాలను ప్రచురించ వద్దని సూచించాయి.
ప్రస్తుత సంక్షోభాలను పరిష్కరించడానికి మరియు అభివృద్ధి, శాంతి పునాదులను బలోపేతం చేయడానికి అరబ్ దేశాల మధ్య మెరుగైన సహకారం, సంఘీభావం అవసరమైన ప్రస్తుత తరుణంలో, ఇటువంటి కథనాలు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు దోహదపడవని, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి మరియు వాస్తవాలను వక్రీకరించడానికి తోడ్పడతాయని అరబ్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ యమాహి ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా తప్పుడు ప్రచారాలను మరియు విభజన సృష్టించే ప్రయత్నాలను అరబ్ పార్లమెంట్ గట్టిగా తిరస్కరిస్తుందని అల్ యమాహి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









