కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- June 14, 2026
కువైట్: కువైట్ లో అర్హులైన విదేశీ పెట్టుబడిదారులకు 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ అనుమతులను పొందేందుకు వీలు కల్పించే కొత్త ప్రేమ్ వర్క్ ను కువైట్ కేబినెట్ ఆమోదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక అథారిటీ సిఫార్సు ఆధారంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ 15 సంవత్సరాల నివాస అనుమతిని జారీ చేస్తుంది.
ఈ రెసిడెన్సీ పథకం, అథారిటీ ఆమోదించిన పదవులలో ఉన్న పెట్టుబడి సంస్థల యజమానులు, భాగస్వాములు, మేనేజర్లు మరియు సీనియర్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. కాగా, అర్హత సాధించడానికి, పెట్టుబడి సంస్థ DIPA జారీ చేసిన చెల్లుబాటు అయ్యే పెట్టుబడి లైసెన్స్ను కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ మరియు క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ను కూడా అందించాలి.
పెట్టుబడి సంస్థ కనీసం KD 5 మిలియన్ల పెట్టుబడి పరిమాణాన్ని మరియు కనీసం KD 1 మిలియన్ మూలధనాన్ని కలిగి ఉండాలి. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన ఐదు పనిదినాలలోపు DIPA దరఖాస్తులను సమీక్షించి నిర్ణయం జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









