అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- June 15, 2026
మనామా: బహ్రెయిన్ అవినీతి నిరోధక, ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ భద్రత జనరల్ డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 నాణ్యతా నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లభించింది. ఇది దాని అభివృద్ధి మరియు కార్యాచరణ ప్రమాణాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి లెఫ్టినెంట్-జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫాదెల్ ప్రశంసించారు. మెరుగైన నాణ్యతా నిర్వహణ పట్ల డైరెక్టరేట్ నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐఎస్ఓ ధృవీకరణను పొందినందుకు డైరెక్టరేట్ను అభినందించారు. ఇది తమ కార్యకలాపాలలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో డైరెక్టరేట్ అంకితభావాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన విజయమని ఆయన అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనితీరును నిరంతరం మెరుగుపరచడం, సేవలను మరింత అభివృద్ధి చేయడం అవసరమని ఆయన చెప్పారు.డైరెక్టరేట్ సిబ్బంది నిరంతర కృషి, నిబద్ధత ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని లెఫ్టినెంట్-జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫాదెల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు









