కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- June 15, 2026
కువైట్: కువైట్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో, ఒక వాహనం అక్కడ నిలిపి ఉంచిన పలు బస్సులను ఢీకొట్టి బోల్తా పడటంతో పాటు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని 'జనరల్ ఫైర్ ఫోర్స్' తెలిపింది. వాహనం బోల్తా పడి మంటలు అంటుకున్న సమాచారం అందగానే, సుభాన్ ఫైర్ సెంటర్కు చెందిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరికొన్ని బస్సులకు కూడా వ్యాపించాయి. దాంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే, బాధితుల వివరాలు లేదా ప్రమాదానికి గల కారణాలకు సంబంధించిన ఇతర వివరాలను అధికారులు ప్రకటించలేదు.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







