మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- June 15, 2026
యూఏఈ: పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు ఆఫ్రికా దేశానికి చేరకుండా దుబాయ్ కస్టమ్స్ అడ్డుకున్నది. సుమారు 1.332 టన్నుల బరువున్న టాపెంట్డోల్ సరుకును స్వాధీనం చేసుకోవడానికి దారితీసిన నిఘా సమాచారాన్ని వారు అందించారు. ఆసియా నుండి వచ్చిన ఈ సరుకును విమాన కార్గో ద్వారా రవాణా చేయగా, అందులో మాదక ద్రవ్యాల పిల్స్ ఉన్నాయి. ఈ సరుకును అడ్డుకోవడంలో దుబాయ్ కస్టమ్స్ ఆఫ్రికా దేశ అధికారులకు సహాయపడింది. ఈ సందర్భంగా సమాజాలను రక్షించడం అనేది భౌగోళిక సరిహద్దులను దాటిన ఉమ్మడి బాధ్యత అని దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా బుసెనాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్ మాదకద్రవ్యాలు మార్కెట్లలోకి రాకుండా నిరోధించి, యువతను నేరాల ప్రమాదం నుండి కాపాడినట్టు పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారం అందించినందుకు దుబాయ్ కస్టమ్స్కు ఆఫ్రికా దేశానికి చెందిన భద్రతా, కస్టమ్స్ అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
దుబాయ్ కస్టమ్స్ సమాచారాన్ని ఎలా సేకరిస్తుంది?
కస్టమ్స్ ఇంటెలిజెన్స్ విభాగం మరియు ప్రత్యేక టాస్క్ ఫోర్స్లో ప్రత్యేక బృందాలు నిరంతరం డేటాను సేకరించి, విశ్లేషిస్తాయి. నేర కార్యకలాపాలు లేదా నిషేధిత పదార్థాలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎయిర్ కార్గో సెంటర్స్ మేనేజ్మెంట్లో, అత్యాధునిక రేడియోగ్రాఫిక్ స్కానింగ్ పరికరాలు, ఏఐ ఇమేజ్ అనాలిసిస్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు. చెకింగ్ ఇన్స్పెక్టర్లకు అత్యాధునిక పరికరాలు అందించి, తాజా స్మగ్లింగ్ పద్ధతులు మరియు కొత్తగా వస్తున్న మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా శిక్షణ ఇస్తారని కస్టమ్స్ తనిఖీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ అల్ గఫారీ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









