కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- June 15, 2026
కువైట్: కువైట్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో, ఒక వాహనం అక్కడ నిలిపి ఉంచిన పలు బస్సులను ఢీకొట్టి బోల్తా పడటంతో పాటు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని 'జనరల్ ఫైర్ ఫోర్స్' తెలిపింది. వాహనం బోల్తా పడి మంటలు అంటుకున్న సమాచారం అందగానే, సుభాన్ ఫైర్ సెంటర్కు చెందిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరికొన్ని బస్సులకు కూడా వ్యాపించాయి. దాంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే, బాధితుల వివరాలు లేదా ప్రమాదానికి గల కారణాలకు సంబంధించిన ఇతర వివరాలను అధికారులు ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు









