డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- June 17, 2026
యూఏఈ: ఎమిరేట్స్ లో డ్రగ్స్ ను పంపిణీ చేయడానికి పన్నిన నేరపూరిత కుట్రను భగ్నం చేసినట్టు యూఏఈ మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ తెలిపింది. ఫెడరల్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రాసిక్యూషన్ నుండి అందిన సమాచారం మేరకు, రాస్ అల్ ఖైమా పోలీసుల సమన్వయంతో ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది.
ఈ ఆపరేషన్ సందర్భంగా భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో పాల్గొన్న 24 మంది నేరస్థులందరి గుర్తింపును పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
కేసు వివరాల ప్రకారం, ఎమిరేట్స్లో ఒకదానిలోని ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు దాచిపెట్టారని అధికారులకు సమాచారం అందింది. ప్రత్యేక బృందాలు వెంటనే గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో మాదకద్రవ్యాలను తరలించడానికి ప్రయత్నిస్తున్న నేర ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు దుబాయ్, అబుదాబి, అజ్మాన్లలో మరో 10 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!









