సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- June 19, 2026
దోహా: ఖతార్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కాలానుగుణ కార్యక్రమాలలో ఒకటైన 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' (స్థానికంగా 'హంబా ఎగ్జిబిషన్' అని పిలుస్తారు) మూడవ ఎడిషన్ సూక్ వాకిఫ్( Souq Waqif)లోని ఈస్టర్న్ స్క్వేర్లో ప్రారంభమైంది. ఇది అత్యుత్తమ భారతీయ మామిడి రకాలు, ఆహార ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఖతార్లోని భారత రాయబారి విపుల్ సమక్షంల.. ప్రైవేట్ ఇంజనీరింగ్ ఆఫీస్ ప్రతినిధి అబ్దుల్రహ్మాన్ మహమ్మద్ అల్ నుఐమి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ఖతార్లోని భారత రాయబార కార్యాలయ సహకారంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ ఆఫీస్ సెలబ్రేషన్స్ కమిటీ దీనిని నిర్వహిస్తోంది. జూన్ 27 వరకు, ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ ప్రదర్శన, సందర్శకులకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు వాణిజ్య అనుభవాన్ని అందిస్తుంది. భారతదేశపు అత్యుత్తమ మామిడి పండ్లు మరియు మామిడి ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
రెండవ ఎడిషన్కు 1,14,400 మందికి పైగా సందర్శకులు హాజరయ్యారు. మొత్తం 1,30,000 కిలోలకు పైగా మామిడి పండ్లు అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం 35కి పైగా భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. ప్రసిద్ధ మామిడి రకాలలో అల్ఫోన్సో, మల్లిక, కేసర్, లంగ్రా, దశహరి మరియు అనేక ఇతర రకాలు ఉన్నాయని ఎగ్జిబిషన్ జనరల్ సూపర్వైజర్ ఖాలిద్ సైఫ్ అల్ సువైది తెలిపారు.
భారత రాయబారి హెచ్.ఇ. విపుల్ మాట్లాడుతూ.. ఈ మ్యాంగో ఫెస్టివల్ ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఖతార్లోని ప్రజలు భారతీయ మామిడి పండ్లను ఎంతగానో ఇష్టపడతారని ఆయన పేర్కొన్నారు. భారత్, ఖతార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 14 బిలియన్ డాలర్లకు పైగా ఉందని తెలిపారు. కారక్ టీ, బిర్యానీ, మామిడి పండ్లు మరియు ఖర్జూరాలతో సహా అనేక ఆహార ఉత్పత్తులు భారత్ , ఖతార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంలో భాగంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







