దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- June 22, 2026
దుబాయ్: కేరళకు చెందిన 42 ఏళ్ల భారతీయ ప్రవాసి దుబాయ్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. మృతుడిని త్రిస్సూర్ జిల్లా, చిట్టిలక్కాడ్లోని సౌత్ పుతియతలకు చెందిన అన్వర్ సాదిక్గా గుర్తించారు. సాదిక్ తన కుమార్తె వివాహ నిమిత్తం ఇటీవల దుబాయ్కి వచ్చాడు. అతను బంధువులు, స్నేహితులతో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.
ఇటీవల నవాయత్ కమ్యూనిటీలో సుప్రసిద్ధ క్రికెటర్, దుబాయ్ నివాసి అయిన 38 ఏళ్ల మహమ్మద్ సఫ్వాన్ షాను, క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుతో మరణించాడు. దుబాయ్లో జరిగిన అతని అంత్యక్రియలకు వందలాది మంది హాజరయ్యారు. ఈ రెండు కేసులు గుండె జబ్బులు, ఆకస్మిక గుండెపోటు, తీవ్రమైన శారీరక శ్రమతో ముడిపడి ఉన్న ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళనలను పెంచాయి.
అల్ ఖుసైస్లోని ఆస్టర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన డాక్టర్ షిప్రా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. గుండె జబ్బులు కేవలం వృద్ధులకే వస్తాయనేది ఒక అపోహ అని అన్నారు. యువకులలో కూడా అనేక క్లినికల్ కార్డియాక్ పరిస్థితులు ఉండవచ్చని, వ్యక్తులు పుట్టుకతోనే గుండె లోపాలు ఉండవచ్చని, అవి తరువాతి వయస్సులో బయటపడవచ్చని అన్నారు. నిర్ధారణలో బయటపడకుండా ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలలో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతీ (HOCM), గుండె విద్యుత్ ప్రసరణ వ్యవస్థలో హెచ్చుతగ్గులు మరియు కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటివి ఉన్నాయని డాక్టర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఏమాత్రం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!







