ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- June 24, 2026
దోహా: ఖతార్ లోని సౌక్ వాకిఫ్లోని 'ఈస్టర్న్ స్క్వేర్'లో భారత రాయబార కార్యాలయ సహకారంతో నిర్వహించిన 3వ 'హంబా' (Hamba) ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రారంభమైన మొదటి ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు మరియు సందర్శకుల సంఖ్య నమోదయ్యాయి.
ఎగ్జిబిషన్ ప్రారంభమైనప్పటి నుండి మామిడి పండ్ల అమ్మకాలు 84 టన్నులకు చేరుకున్నాయి. ఇది గత ఎడిషన్లో మొదటి ఐదు రోజుల్లో నమోదైన 56 టన్నుల అమ్మకాల కంటే ఇది చాలా ఎక్కువని నిర్వాహకులు ప్రకటించారు.
గత ఏడాది ఇదే కాలంలో 52,000 మందికి పైగా సందర్శకులు రాగా, ఈసారి మొదటి ఐదు రోజుల్లోనే 74,000 మందికి పైగా సందర్శకులు వచ్చారు. అత్యుత్తమ భారతీయ మామిడి రకాలతో పాటు జ్యూస్లు, డెజర్ట్లు, పచ్చళ్లు, డ్రింక్స్ మరియు ఇతర ప్రత్యేక ఆహార పదార్థాల వంటి విస్తృత శ్రేణి మామిడి ఆధారిత ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ ఏడాది ఎడిషన్లో 35కి పైగా భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ఇవి భారతదేశంలోని అత్యుత్తమ మామిడి రకాలతో పాటు, మామిడి ఆధారిత ఆహార ఉత్పత్తులు మరియు వంటకాలను ప్రదర్శిస్తూ, సందర్శకులకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు రుచికరమైన అనుభూతిని అందిస్తున్నాయి.
మొదటి ఐదు రోజుల్లో సాధించిన అద్భుతమైన ఫలితాలు ఈ మూడవ ఎడిషన్ విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఎగ్జిబిషన్ జనరల్ సూపర్వైజర్ ఖలీద్ సైఫ్ అల్ సువైదీ పేర్కొన్నారు. జూన్ 27 వరకు మ్యాంగో ఫెస్టివల్ కొనసాగుతుందని, ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







