నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- June 24, 2026
సోహార్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని సోహార్ విలాయత్లో 'మ్యాంగో ఎక్స్ ట్రావాగంజా 2026' (మామిడి పండ్ల ఉత్సవం) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని సోహార్ 'వలీ' (ప్రాంతీయ అధికారి) కార్యాలయం.. నార్త్ అల్ బతినాలోని వ్యవసాయ, మత్స్య మరియు జల వనరుల డైరెక్టరేట్ జనరల్ సహకారంతో నిర్వహిస్తోంది. ఇందులో గవర్నరేట్లోని వివిధ విలాయత్ల నుండి అనేక మంది రైతులు పాల్గొంటున్నారు.
నార్త్ అల్ బతినా గవర్నర్ మహమ్మద్ సులైమాన్ అల్ కిండి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడం, ఒమానీ మామిడి పంట స్థాయిని పెంచడం, గవర్నరేట్లోని వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత మరియు వైవిధ్యాన్ని చాటిచెప్పడం, తమ ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహించడం మరియు స్థానిక ఉత్పత్తుల ప్రచారానికి కొత్త అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సోహార్ వలీ షేక్ సౌద్ మహమ్మద్ అల్ హినాయి వివరించారు.
ఈ ఉత్సవంలో 45 పెవిలియన్లు ఏర్పాటు చేశారు. వీటిలో వివిధ రకాల ఒమానీ మామిడి పండ్లు మరియు వాటి అనుబంధ ఉత్పత్తులతో పాటు తాజా ఖర్జూరాలు (రుతాబ్), గ్రేబ్స్, అరటిపండ్లు, అంజూర (figs) మరియు నిమ్మకాయలు వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తున్నారు. వీటితోపాటు అనేక శాస్త్రీయ మరియు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యవసాయ రంగ నిపుణులు మరియు శాస్త్రవేత్తలు పాల్గొని వారి అనుభవాలు, పరిశోధనలను రైతులతో పంచుకుంటున్నారు. అలాగే, నార్త్ అల్ బతినా గవర్నరేట్కు చెందిన రైతుల తమ విజయవంతమైన అనుభవాలను వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







