తగ్గిన పసిడి, వెండి ధరలు

- August 11, 2016 , by Maagulf
తగ్గిన పసిడి, వెండి ధరలు

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో నిన్న జోరుగా పెరిగిన పసిడి, వెండి ధరలు గురువారం కాస్త దిగొచ్చాయి. బంగారం ధర రూ. 150కి పైగా తగ్గగా.. వెండి రూ. 47వేల దిగువకు చేరింది. నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.
దేశీయ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 155 తగ్గింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,125గా ఉంది. అంతర్జాతీయంగా 0.4శాతం తగ్గి సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,341.50 డాలర్లుగా ఉంది. మరోవైపు రూ. 400 తగ్గడంతో.. బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,950గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com