తగ్గిన పసిడి, వెండి ధరలు
- August 11, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో నిన్న జోరుగా పెరిగిన పసిడి, వెండి ధరలు గురువారం కాస్త దిగొచ్చాయి. బంగారం ధర రూ. 150కి పైగా తగ్గగా.. వెండి రూ. 47వేల దిగువకు చేరింది. నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
దేశీయ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 155 తగ్గింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,125గా ఉంది. అంతర్జాతీయంగా 0.4శాతం తగ్గి సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,341.50 డాలర్లుగా ఉంది. మరోవైపు రూ. 400 తగ్గడంతో.. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,950గా ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







