APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- July 02, 2026
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస ఆంధ్రుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ప్రాంతీయ, రాష్ట్ర, దేశ స్థాయిల్లో 600 మందికి పైగా కోఆర్డినేటర్లను నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దేశ విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది.
కొత్తగా నియమితులైన కోఆర్డినేటర్లు ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేయడంలో వారధిగా వ్యవహరించనున్నారు.
ఏపీఎన్ఆర్టీఎస్, భారత రాయబార కార్యాలయాలు, స్థానిక ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేస్తూ స్వచ్ఛంద సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే ఉద్యోగ, విద్య, న్యాయ, ఆరోగ్య, అత్యవసర సహాయ అంశాల్లో కూడా కోఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
ప్రవాస ఆంధ్రులతో ప్రభుత్వానికి మధ్య బలమైన అనుసంధానం ఏర్పరచడం, వారి సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించడం, పెట్టుబడులు మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో ఈ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కొత్తగా నియమితులైన కోఆర్డినేటర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాసాంధ్రుల సేవలో నిబద్ధతతో పనిచేయాలని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజానికి అండగా నిలవాలని సూచించారు. వారి సేవలు రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన అందించేలా ఈ కోఆర్డినేటర్ల వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఇది మరింత భరోసాను కల్పించే నిర్ణయంగా భావిస్తున్నారు.
ఈ నియామకాలతో ప్రవాస ఆంధ్రుల సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో అమలు కావడంతో పాటు, ప్రభుత్వం మరియు ప్రవాసాంధ్రుల మధ్య అనుసంధానం మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఈ వ్యవస్థ కీలక వేదికగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



తాజా వార్తలు
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!
- భారత్ నుంచి మెయిడ్ యూఏఈకి తీసుకురావాలా? రూల్స్, వీసా ప్రక్రియ ఇదే..!!
- కారు గెలిచిన విజేతకు వాల్ క్లాక్.. ఒమన్ కోర్టు కీలక తీర్పు..!!
- అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఖతార్ స్టూడెంట్స్..!!
- కువైట్లో ఆన్లైన్ నగదు బదిలీలపై పరిమితి..!!
- సౌదీ అరేబియాలో GCC వాహనాలకు 90 రోజుల గడువు..!!
- ‘టాక్సిక్’ ఈవెంట్లో మల్లారెడ్డి స్పీచ్ వైరల్
- తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయం
- UKలో అంబేడ్కర్ ఇంటిని సందర్శించిన సీఎం రేవంత్
- ముంబైలో 22 అడుగుల గణేశ్ విగ్రహం మీద పడి ఇద్దరి మృతి







