కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- July 05, 2026
హైదరాబాద్: ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలులో డ్రగ్ కంట్రోల్ మరియు ఫుడ్ సేఫ్టీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న ఈ రెండు శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా వారంలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో శాఖల మధ్య సమన్వయం పెరిగి, విధుల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా సీఎస్ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, సిబ్బంది పరిస్థితి తదితర అంశాలపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు,ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ , సీఎంవో ప్రధాన కార్యదర్శులు శేషాద్రి, ఎన్.శ్రీధర్, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఆరోగ్య కమిషనర్ సంగీత, డ్రగ్ కంట్రోలర్ జనరల్ అవినాష్ మొహంతి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







