ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- July 07, 2026
మస్కట్: ఒమన్లోని దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పరిధిలోని బర్కా విలాయత్ లో విద్యుత్ కేబుళ్లను దొంగిలించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రాయల్ ఒమాన్ పోలీస్కు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. బర్కాలోని ఓ విద్యుత్ పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ కేబుళ్లను దొంగిలించిన ఘటనపై దర్యాప్తు చేపట్టగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని పలు ప్రాంతాల్లో జరిగిన మరో ఐదు విద్యుత్ కేబుళ్ల చోరీ ఘటనల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







