ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- July 07, 2026
మస్కట్: ఒమన్లోని దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పరిధిలోని బర్కా విలాయత్ లో విద్యుత్ కేబుళ్లను దొంగిలించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రాయల్ ఒమాన్ పోలీస్కు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. బర్కాలోని ఓ విద్యుత్ పంపిణీ కేంద్రం నుంచి విద్యుత్ కేబుళ్లను దొంగిలించిన ఘటనపై దర్యాప్తు చేపట్టగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని పలు ప్రాంతాల్లో జరిగిన మరో ఐదు విద్యుత్ కేబుళ్ల చోరీ ఘటనల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







