కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- July 07, 2026
కువైట్ : కువైట్ లో కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు దేశ కార్మిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు కార్మిక హక్కులు, కార్మిక మార్కెట్ సంస్కరణలు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించే అంశాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్పవర్ (PAM) సంయుక్తంగా చర్చించాయి.
ఉద్యోగ వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటు కార్మికులకు మరింత భద్రత కల్పించే చర్యలపై దృష్టి సారించినట్లు మానవ హక్కుల వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అంబాసడర్ షేకా జవాహర్ అల్-సబా తెలిపారు. కార్మికులు, యజమానుల హక్కులను కాపాడేలా కార్మిక చట్టాలు, విధానాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్లు వెల్లడించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడంలో కువైట్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి కార్మికులను పంపే దేశాలతో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను (MoUs) మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ సంస్థలతో సహకారాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్పవర్ డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమీ తెలిపారు. ఈ చర్యలతో కార్మిక మార్కెట్పై పర్యవేక్షణ కూడా బలోపేతం అవుతుందన్నారు. కువైట్లో పారదర్శకమైన, సమర్థవంతమైన కార్మిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈ చర్యలు మరో కీలక అడుగుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







