వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- July 08, 2026
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్లోని వైఎస్ఆర్ నివాసానికి చేరుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నల్గొండ లోక్సభ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు (MP) కుందురు రఘువీర్ రెడ్డి, రామగుండం శాసనసభ్యులు (MLA) మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తదితర ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొని వైఎస్సార్ను భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్ పథకాలు
వైఎస్ఆర్ నివాళి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనా కాలంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన పేదల కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి పథకాలు సమాజంలో విపరీతమైన మార్పులు తెచ్చాయని గుర్తుచేశారు. నిరుపేదలు, రైతులు, విద్యార్థుల అభ్యున్నతి కోసం వైఎస్సార్ అందించిన విశేష సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని, ఆయన చూపిన ప్రజా సంక్షేమ బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజాపాలనను అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







