చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- July 09, 2026
దోహా: చైనా, మలేషియా నుంచి దిగుమతి అవుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీలపై ఖతార్ ప్రభుత్వం ఫైనల్ యాంటీ-డంపింగ్ సుంకాలను విధించింది. ఈ మేరకు ఖతార్ వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ 2026 సంవత్సరానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ అక్యుములేటర్లపై 25.8 శాతం నుంచి 74 శాతం వరకు, మలేషియా నుంచి దిగుమతి అయ్యే వాటిపై 43.2 శాతం నుంచి 77 శాతం వరకు యాంటీ-డంపింగ్ సుంకాలు అమలులో ఉంటాయి. ఆయా ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు నిర్ధారించిన డంపింగ్ మార్జిన్ను బట్టి సుంకాల శాతం నిర్ణయించబడుతుంది.
దేశీయ పరిశ్రమలను రక్షించడం, డంపింగ్ను అరికట్టడం, ఖతార్లో తయారయ్యే ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ సహకార మండలి (GCC) పారిశ్రామిక సహకార కమిటీ ఆమోదించిన తుది యాంటీ-డంపింగ్ చర్యల్లో భాగంగానే ఈ సుంకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
జీసీసీ సమగ్ర కస్టమ్స్ టారిఫ్లోని హెడ్డింగ్ నంబర్ 8507, హెచ్ఎస్ కోడ్ 85071000 కింద వర్గీకరించిన ఎలక్ట్రిక్ అక్యుములేటర్ల దిగుమతులకు ఈ నిర్ణయం వర్తించనుందని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







