క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్

- July 09, 2026 , by Maagulf
క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్

కువైట్: గగనతలంలో అడ్డుకున్న క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడిన ప్రాంతాలకు వెళ్లవద్దని కువైట్ సైన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాంటి ప్రాంతాలకు చేరుకోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని జనరల్ స్టాఫ్ హెచ్చరించింది.

క్షిపణి లేదా డ్రోన్ శకలాలు పడిన ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు తీయకూడదని, వాటిని సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం మానుకోవాలని సూచించింది. భద్రత, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అధికారిక వర్గాల నుంచే వచ్చే ప్రకటనలను మాత్రమే ఫాలో కావాలన సైన్యం స్పష్టం చేసింది.

ప్రస్తుతం కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్ల ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సైన్యం ప్రజలను కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com