కోలీవుడ్కు శుభవార్త!
- August 12, 2016
కోలీవుడ్కు శుభవార్త! త్వరలోనే సినీ పరిశ్రమకు ప్రభుత్వ అవార్డులు అందనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎమ్మెల్యే, నటుడు వైగై చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా సినీపరిశ్రమకు ప్రభుత్వ అవార్డులు లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలోకి జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ... త్వరలోనే భారీగా ఉత్సవం నిర్వహించి సినీ పరిశ్రమకు ఆరేళ్లకు సంబంధించిన అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నటీనటులతో పాటు, టెక్నీషియన్లకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. అంతేగాక బుల్లితెర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. గత డీఎంకే ప్రభుత్వం మూడేళ్లపాటు పోలీసులకు అవార్డులు ఇవ్వకుండా నిలిపేసిందని విమర్శిస్తూ.. తాను అధికారంలోకి రాగానే పోలీసుశాఖకు మెడల్స్ బహూకరించానన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు. అమ్మా! కృతజ్ఞతలు: నడిగర్ సంఘం సినీ పరిశ్రమకు త్వరలోనే అవార్డులు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జయలలితకు నడిగర్ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, ఉపాధ్యక్షుడు పొనవన్నన శుక్రవారం సాయంత్రం నగరంలో విలేఖరులతో మాట్లాడుతూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సంఘం కోసం నిర్మితమవుతున్న భవనాన్ని ప్రారంభించబోతున్నారని, అదే విధంగా ఇప్పుడు అవార్డులు ప్రకటించినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







