యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- July 13, 2026
అబుదాబి: ఖతార్ మాజీ అమీర్, ప్రస్తుత ఖతార్ అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాపంగా యూఏఈ నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. జులై 15 (బుధవారం) వరకు ఈ సంతాప దినాలు అమలులో ఉంటాయని యూఏఈ ప్రెసిడెన్షియల్ కోర్ట్ వెల్లడించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, అధికారిక సంస్థలతో పాటు విదేశాల్లోని యూఏఈ రాయబార కార్యాలయాలు (ఎంబసీలు), దౌత్య కార్యాలయాలపై జాతీయ జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేయనున్నారు.
ఖతార్ ఫాదర్ అమీర్ మరణం పట్ల యూఏఈ తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ, ఖతార్ రాజకుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది.
ఇప్పటికే కువైట్ కూడా తమ దేశంలో నాలుగు రోజుల అధికారిక సంతాప దినాలను ప్రకటించగా, ఖతార్ ప్రభుత్వంజులై 12 నుండి నాలుగు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఖతార్లో జులై 13 నుండి ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులందరూ తిరిగి జులై 19 (ఆదివారం) న విధుల్లో చేరనున్నారు. లూసైల్ స్మశానవాటికలో షేక్ హమద్ అంత్యక్రియలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







