యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- July 13, 2026
అబుదాబి: ఖతార్ మాజీ అమీర్, ప్రస్తుత ఖతార్ అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాపంగా యూఏఈ నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. జులై 15 (బుధవారం) వరకు ఈ సంతాప దినాలు అమలులో ఉంటాయని యూఏఈ ప్రెసిడెన్షియల్ కోర్ట్ వెల్లడించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, అధికారిక సంస్థలతో పాటు విదేశాల్లోని యూఏఈ రాయబార కార్యాలయాలు (ఎంబసీలు), దౌత్య కార్యాలయాలపై జాతీయ జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేయనున్నారు.
ఖతార్ ఫాదర్ అమీర్ మరణం పట్ల యూఏఈ తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ, ఖతార్ రాజకుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది.
ఇప్పటికే కువైట్ కూడా తమ దేశంలో నాలుగు రోజుల అధికారిక సంతాప దినాలను ప్రకటించగా, ఖతార్ ప్రభుత్వంజులై 12 నుండి నాలుగు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఖతార్లో జులై 13 నుండి ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులందరూ తిరిగి జులై 19 (ఆదివారం) న విధుల్లో చేరనున్నారు. లూసైల్ స్మశానవాటికలో షేక్ హమద్ అంత్యక్రియలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







