కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- July 14, 2026
కువైట్ సిటీ: కువైట్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన శత్రు క్షిపణులు, డ్రోన్ దాడి యత్నాలను దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రకటించింది.
కువైట్ న్యూస్ ఏజెన్సీ (KUNA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశ గగనతలంలోకి ప్రవేశించిన శత్రు క్షిపణులు, డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి వెంటనే అడ్డుకుని ధ్వంసం చేస్తున్నట్లు తెలిపింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో వినిపించిన భారీ పేలుడు శబ్దాలు శత్రు దాడుల వల్ల కాకుండా, వాటిని అడ్డుకునే క్రమంలో వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులు, డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేయడం వల్లే సంభవించాయని జనరల్ స్టాఫ్ స్పష్టం చేసింది.
పరిస్థితిని భద్రతా సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, దేశ ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని, పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచించారు.
ప్రస్తుతం శత్రు దాడులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కువైట్ సాయుధ దళాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని జనరల్ స్టాఫ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..







