పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- July 16, 2026
టెహ్రాన్: మిడిల్ ఈస్ట్లోని పొరుగు దేశాలతో ఘర్షణకు దిగే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ప్రాంతీయ దేశాలతో సోదరభావ సంబంధాలు, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మొహమ్మద్ అక్రమినియా తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, "పొరుగు దేశాలు లేదా ప్రాంతంలోని ఇస్లామిక్ దేశాలతో తలపడాలనే ఉద్దేశం ఇరాన్కు లేదు. ప్రాంతీయ దేశాలతో సహకారాన్ని విస్తరించడం, సోదరభావ సంబంధాలను పెంపొందించడానికే ఇరాన్ ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఇస్తోంది" అని పేర్కొన్నారు.
అయితే దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలు, ఇరాన్ గౌరవాన్ని కాపాడటం తమ సాయుధ దళాల అత్యున్నత బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఎలాంటి రాజీ ఉండదని, దేశ రక్షణ కోసం అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామని వెల్లడించారు.
కాగా, అంతకుముందు ఇరాన్కు చెందిన మరో సైనిక అధికారి, అమెరికా ఇరాన్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రాంతీయ మౌలిక సదుపాయాలను "చిత్తు చేస్తాం" అంటూ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో, ఆ వ్యాఖ్యలకు భిన్నంగా ఇరాన్ సైన్యం తాజాగా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఇరాన్ తాజా ప్రకటనపై అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
తాజా వార్తలు
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్







