డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- July 16, 2026
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గురువారం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన గవర్నర్, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్కు త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.
ముంబైలో ఇటీవల పవన్ కళ్యాణ్కు భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్వయంగా నివాసానికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







