డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- July 16, 2026
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గురువారం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన గవర్నర్, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్కు త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.
ముంబైలో ఇటీవల పవన్ కళ్యాణ్కు భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్వయంగా నివాసానికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..







