ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- July 17, 2026
మస్కట్: ఒమన్లో పనిచేస్తున్న నాన్-ఒమానీ ఉద్యోగులందరికీ సిక్ లీవ్, అసాధారణ సెలవు (Extraordinary Leave) బీమా తప్పనిసరి చేస్తూ సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన జూలై 19 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, అలాగే కార్మిక చట్టం పరిధిలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని నాన్-ఒమానీ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. రాయల్ డిక్రీ (నం. 52/2023) ద్వారా షల్ ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చింది.
నూతన నిబంధనలోని ఆర్టికల్-1 ప్రకారం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని ప్రభుత్వ విభాగాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, కార్మిక చట్టం పరిధిలోని ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే అన్ని నాన్-ఒమనీ ఉద్యోగులకు ఈ బీమా తప్పనిసరి. ఆర్టికల్-2 ప్రకారం ఈ నిర్ణయానికి విరుద్ధంగా ఉన్న గత నిబంధనలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై ఇంజినీర్ సలీమ్ బిన్ నాసర్ బిన్ సయీద్ అల్ అవ్ఫీ, ఒమాన్ ఇంధన, ఖనిజాల మంత్రి మరియు సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ బోర్డు ఛైర్మన్ సంతకం చేశారు. కొత్త నిబంధనతో ఒమాన్లో పనిచేస్తున్న ప్రవాస ఉద్యోగులకు సామాజిక భద్రత మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







