ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- July 17, 2026
మస్కట్: ఒమన్లో పనిచేస్తున్న నాన్-ఒమానీ ఉద్యోగులందరికీ సిక్ లీవ్, అసాధారణ సెలవు (Extraordinary Leave) బీమా తప్పనిసరి చేస్తూ సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన జూలై 19 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, అలాగే కార్మిక చట్టం పరిధిలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని నాన్-ఒమానీ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. రాయల్ డిక్రీ (నం. 52/2023) ద్వారా షల్ ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చింది.
నూతన నిబంధనలోని ఆర్టికల్-1 ప్రకారం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని ప్రభుత్వ విభాగాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, కార్మిక చట్టం పరిధిలోని ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే అన్ని నాన్-ఒమనీ ఉద్యోగులకు ఈ బీమా తప్పనిసరి. ఆర్టికల్-2 ప్రకారం ఈ నిర్ణయానికి విరుద్ధంగా ఉన్న గత నిబంధనలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై ఇంజినీర్ సలీమ్ బిన్ నాసర్ బిన్ సయీద్ అల్ అవ్ఫీ, ఒమాన్ ఇంధన, ఖనిజాల మంత్రి మరియు సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ బోర్డు ఛైర్మన్ సంతకం చేశారు. కొత్త నిబంధనతో ఒమాన్లో పనిచేస్తున్న ప్రవాస ఉద్యోగులకు సామాజిక భద్రత మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







