ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- July 17, 2026
దోహా: ఖతార్లో ప్రజా ప్రదేశాల పరిశుభ్రత, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ 2025లో మొత్తం 7,144 నిరుపయోగ (అబాండన్డ్) వాహనాలు, యంత్రాలను సంయుక్త కమిటీ తొలగించింది. ఈ మేరకు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. తొలగించిన వాహనాల్లో 5,340 వాహనాలను అల్ మషాఫ్ ఇంపౌండ్ సెంటర్కు, 1,804 వాహనాలను ఉమ్ సలాల్ ఇంపౌండ్ సెంటర్కు తరలించారు. ఈ వాహనాల వేలం ద్వారా ప్రభుత్వం 10.623 మిలియన్ ఖతారీ రియాల్స్ (QR) విలువైన ఆదాయం వచ్చింది. నిరుపయోగ వాహనాలపై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలకు 'ఔన్ (Oun)' స్మార్ట్ యాప్, మున్సిపాలిటీ అధికారిక వెబ్సైట్, అలాగే ప్రభుత్వ హెల్ప్లైన్ 184 ద్వారా సమాచారం అందించే సౌకర్యాన్ని కల్పించారు.
గత ఏడాదిలో కమిటీ 48 సమావేశాలు నిర్వహించగా, వివిధ మున్సిపాలిటీల్లో 52 ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలను చేపట్టి నిరుపయోగ వాహనాలను గుర్తించి తొలగించింది. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, నివాస ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో వదిలివేసిన వాహనాలు, భారీ యంత్రాలను తొలగించడం, వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించడం, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏడాది పొడవునా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. 2026లో డిజిటల్ సేవల విస్తరణ, అమలు ప్రక్రియల మెరుగుదల, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!







