ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- July 17, 2026
దోహా: ఖతార్లో ప్రజా ప్రదేశాల పరిశుభ్రత, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ 2025లో మొత్తం 7,144 నిరుపయోగ (అబాండన్డ్) వాహనాలు, యంత్రాలను సంయుక్త కమిటీ తొలగించింది. ఈ మేరకు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. తొలగించిన వాహనాల్లో 5,340 వాహనాలను అల్ మషాఫ్ ఇంపౌండ్ సెంటర్కు, 1,804 వాహనాలను ఉమ్ సలాల్ ఇంపౌండ్ సెంటర్కు తరలించారు. ఈ వాహనాల వేలం ద్వారా ప్రభుత్వం 10.623 మిలియన్ ఖతారీ రియాల్స్ (QR) విలువైన ఆదాయం వచ్చింది. నిరుపయోగ వాహనాలపై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలకు 'ఔన్ (Oun)' స్మార్ట్ యాప్, మున్సిపాలిటీ అధికారిక వెబ్సైట్, అలాగే ప్రభుత్వ హెల్ప్లైన్ 184 ద్వారా సమాచారం అందించే సౌకర్యాన్ని కల్పించారు.
గత ఏడాదిలో కమిటీ 48 సమావేశాలు నిర్వహించగా, వివిధ మున్సిపాలిటీల్లో 52 ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలను చేపట్టి నిరుపయోగ వాహనాలను గుర్తించి తొలగించింది. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, నివాస ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో వదిలివేసిన వాహనాలు, భారీ యంత్రాలను తొలగించడం, వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించడం, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏడాది పొడవునా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. 2026లో డిజిటల్ సేవల విస్తరణ, అమలు ప్రక్రియల మెరుగుదల, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







