ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- July 17, 2026
దోహా: ఖతార్లో ప్రజా ప్రదేశాల పరిశుభ్రత, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ 2025లో మొత్తం 7,144 నిరుపయోగ (అబాండన్డ్) వాహనాలు, యంత్రాలను సంయుక్త కమిటీ తొలగించింది. ఈ మేరకు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. తొలగించిన వాహనాల్లో 5,340 వాహనాలను అల్ మషాఫ్ ఇంపౌండ్ సెంటర్కు, 1,804 వాహనాలను ఉమ్ సలాల్ ఇంపౌండ్ సెంటర్కు తరలించారు. ఈ వాహనాల వేలం ద్వారా ప్రభుత్వం 10.623 మిలియన్ ఖతారీ రియాల్స్ (QR) విలువైన ఆదాయం వచ్చింది. నిరుపయోగ వాహనాలపై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలకు 'ఔన్ (Oun)' స్మార్ట్ యాప్, మున్సిపాలిటీ అధికారిక వెబ్సైట్, అలాగే ప్రభుత్వ హెల్ప్లైన్ 184 ద్వారా సమాచారం అందించే సౌకర్యాన్ని కల్పించారు.
గత ఏడాదిలో కమిటీ 48 సమావేశాలు నిర్వహించగా, వివిధ మున్సిపాలిటీల్లో 52 ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలను చేపట్టి నిరుపయోగ వాహనాలను గుర్తించి తొలగించింది. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, నివాస ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో వదిలివేసిన వాహనాలు, భారీ యంత్రాలను తొలగించడం, వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించడం, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏడాది పొడవునా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. 2026లో డిజిటల్ సేవల విస్తరణ, అమలు ప్రక్రియల మెరుగుదల, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







