అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- July 24, 2026
కువైట్ సిటీ: కువైట్లోని అల్-అబ్దాలి సరిహద్దు చెక్పోస్ట్పై గురువారం మధ్యాహ్నం డ్రోన్లతో దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అల్-అత్వాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో పేలుడు పదార్థాల నిర్వీర్య బృందాలు (EOD) ఘటనాస్థలాన్ని పూర్తిగా పరిశీలించి, డ్రోన్ల శకలాలను తొలగించడంతో పాటు, సరిహద్దు చెక్పోస్ట్ పరిసర ప్రాంతం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించాయి.
కువైట్ సాయుధ దళాలు దేశ సరిహద్దుల రక్షణతో పాటు దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు అత్యున్నత అప్రమత్తతతో పూర్తి సంసిద్ధతలో విధులు నిర్వహిస్తున్నాయని కల్నల్ అల్-అత్వాన్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







