అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!

- July 24, 2026 , by Maagulf
అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!

కువైట్ సిటీ: కువైట్‌లోని అల్-అబ్దాలి సరిహద్దు చెక్‌పోస్ట్‌పై గురువారం మధ్యాహ్నం డ్రోన్లతో దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అల్-అత్వాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు.  సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో పేలుడు పదార్థాల నిర్వీర్య బృందాలు (EOD) ఘటనాస్థలాన్ని పూర్తిగా పరిశీలించి, డ్రోన్ల శకలాలను తొలగించడంతో పాటు, సరిహద్దు చెక్‌పోస్ట్ పరిసర ప్రాంతం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించాయి.

కువైట్ సాయుధ దళాలు దేశ సరిహద్దుల రక్షణతో పాటు దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు అత్యున్నత అప్రమత్తతతో పూర్తి సంసిద్ధతలో విధులు నిర్వహిస్తున్నాయని కల్నల్ అల్-అత్వాన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com