భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- July 24, 2026
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఆసియాన్ (ASEAN) ట్రీటీ ఆఫ్ అమిటీ అండ్ కోఆపరేషన్ ఒప్పందం కుదిరి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన మంత్రుల సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా సముద్ర రవాణా, సప్లై చైన్స్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఇరు దేశాలు సమన్వయాన్ని కొనసాగించాలని ఇరు మంత్రులు పునరుద్ఘాటించారు.
అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను దౌత్య, శాంతియుత మార్గాలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో ఫిలిప్పీన్స్ లోని ఒమన్ రాయబారి ఇంజినీర్ నాసర్ అల్ మన్వారితో పాటు ఇరు దేశాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







