బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- July 25, 2026
కువైట్ సిటీ: ట్రాఫిక్ జరిమానాలు (ఫైన్లు) చెల్లించని అన్ని వాహనాలను సరిహద్దు చెక్పోస్టుల ద్వారా దేశం వెలుపలికి వెళ్లనివ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) స్పష్టం చేసింది. న్యాయపరమైన లేదా ముందస్తు జప్తు (ఇంపౌండ్)కు గురైన వాహనాలు, అలాగే ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వాహనాలకే సరిహద్దు దాటేందుకు ఆంక్షలు ఉంటాయని తెలిపింది. కేవలం ట్రాఫిక్ ఫైన్లు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో వాహనాలపై ఎలాంటి నిషేధం విధించడం లేదని వెల్లడించింది.
అలాగే, కువైట్ పౌరులు దేశం విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ ఫైన్లు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు తమపై ఉన్న ట్రాఫిక్ ఫైన్లన్నింటినీ చెల్లించాల్సి ఉంటుందని, ఇది అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారమేనని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ధృవీకరించకుండా షేర్ చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్లో మరింత సులభంగా డొమెస్టిక్ వర్కర్ నియామకం..!!
- ఒమన్–అమెరికా జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం..!!
- ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం







