నేడే తొలి ఏకాదశి..
- July 25, 2026
తెలుగువారి ముఖ్యమైన పండగలలో అత్యంత పవిత్రమైనది, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది ‘తొలి ఏకాదశి’ (శయని ఏకాదశి). ఈ శుభదినాన శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజామునే తలస్నానం ఆచరించి, ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసీ దళాలతో సమంత్రకంగా అర్చన చేసి, భక్తిశ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. జగద్రక్షకుడైన విష్ణుమూర్తి దివ్య నామాలను స్మరిస్తూ పూజించడం వల్ల సకల సంపదలు, మనశ్శాంతి లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఉపవాసం, జాగరణలతో పాప విమోచనం
తొలి ఏకాదశి నాడు ఆచరించే నియమాలకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున అన్నం, బియ్యంతో తయారు చేసిన వంటకాలు, ధాన్య పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లితో పాటు మాంసాహారం మరియు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. పూర్తి ఉపవాస నియమాన్ని పాటిస్తూ, రాత్రి సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు మరియు కీర్తనలతో ‘జాగరణ’ చేయాలి. ఈ విధంగా మనస్సును, కాయాన్ని భగవంతునిపై లగ్నం చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోయి, భవబంధాల నుండి ముక్తి లభించడమే కాకుండా శ్రీమహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహం సిద్ధడుతుందని విశ్వసిస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!







