జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- July 26, 2026
రియాద్: సౌదీ అరేబియా మొబైల్ ఇంటర్నెట్ వేగాల్లో మరో కీలక మైలురాయిని సాధించింది. కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) విడుదల చేసిన సౌదీ ఇంటర్నెట్ 2025 ఐదో ఎడిషన్ నివేదిక ప్రకారం, దేశంలో సగటు మొబైల్ ఇంటర్నెట్ వేగం 203 Mbps నుంచి 216 Mbpsకు పెరిగింది. డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణతో సాధ్యమైన ఈ వృద్ధి కారణంగా, మొబైల్ ఇంటర్నెట్ వేగాల సూచీలో సౌదీ అరేబియా జీ20 దేశాల్లో టాప్-5లో స్థానం సంపాదించింది.
సౌదీలో ఒక్కో వ్యక్తి నెలకు సగటున 53 జీబీ మొబైల్ డేటా వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే దాదాపు మూడింతలు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 5జీ నెట్వర్క్లలో మధ్యస్థ డౌన్లోడ్ వేగం 320 Mbpsకు చేరగా, మొబైల్ ఇంటర్నెట్ లేటెన్సీ 24 మిల్లీసెకన్లుగా నమోదైంది. ఇక ఫిక్స్డ్ ఇంటర్నెట్ విభాగంలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. మధ్యస్థ డౌన్లోడ్ వేగం గత ఏడాది 120.4 Mbps నుంచి 151 Mbpsకు పెరిగింది. అప్లోడ్ వేగం 73 Mbpsగా ఉండగా, లేటెన్సీ 8 మిల్లీసెకన్లుగా నమోదైంది.
దేశవ్యాప్తంగా మొత్తం ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ 69 మిలియన్ టెరాబైట్లకు చేరిందని నివేదిక తెలిపింది. ఇందులో 56 శాతం దేశీయ ట్రాఫిక్, 44 శాతం అంతర్జాతీయ ట్రాఫిక్ గా నమోదైంది. మొబైల్ మరియు ఫిక్స్డ్ నెట్వర్క్లు తలా 50 శాతం చొప్పున మొత్తం డేటా ట్రాఫిక్లో వాటా కలిగి ఉన్నాయి.
ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. రియాద్ ప్రాంతం 30.6 శాతంతో అత్యధిక డేటా ట్రాఫిక్ను నమోదు చేసింది. ఆ తర్వాత మక్కా ప్రాంతం 20.5 శాతం, తూర్పు ప్రావిన్స్ 16.8 శాతం వాటాతో నిలిచాయి. దేశంలోని 67 శాతం వినియోగదారులు IPv6 (ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్-6)ను వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అలాగే సౌదీకి చెందిన ఆటోనమస్ సిస్టమ్ నంబర్లు (ASNs) దాదాపు 200కు చేరాయని పేర్కొంది. ఇది దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల నిరంతర అభివృద్ధికి నిదర్శనమని CST తెలిపింది.
ఈ నివేదిక విడుదలైన వేళ, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) విడుదల చేసిన 2026 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇండెక్స్ లో సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. మొత్తం 159 దేశాలను అధిగమించి సౌదీ అగ్రస్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం
- వాణిజ్యం నుంచి లాజిస్టిక్స్ కారిడార్ల వరకు..విస్తరిస్తున్న భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!







