బీఎస్ఎన్ఎల్ వారి బంపర్ ఆఫర్
- August 14, 2016
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా తమ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. ప్రతి ఆదివారం ల్యాండ్లైన్ నుంచి దేశంలోని ఏ నెట్వర్క్ ల్యాండ్లైన్ లేదా మొబైల్ ఫోన్కు అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు టెలికాంశాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ మరో ఆఫర్ను ప్రకటించింది. స్వాతంత్య్రదినోత్సవం(ఆగస్టు 15న) సందర్భంగా ల్యాండ్లైన్ నుంచి ఏ నెట్వర్క్ ల్యాండ్లైన్ లేదా మొబైల్ ఫోన్కు అపరిమితంగా మాట్లాడుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రైవేటు సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే రాత్రి 9 నుంచి 7 గంటల వరకు ల్యాండ్లైన్ నుంచి ఏ నెట్వర్క్ ల్యాండ్లైన్ లేదా మొబైల్కు అపరిమితంగా మాట్లాడుకునే సౌకర్యాన్ని బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







