నజ్రాన్‌లో ఆరుగురు వలసకార్మికులకు గాయాలు

- August 15, 2016 , by Maagulf
నజ్రాన్‌లో ఆరుగురు వలసకార్మికులకు గాయాలు

యెమెన్‌ నుంచి సంభవించిన పేలుళ్ళ కారణంగా, నజ్రాన్‌ ప్రాంతంలోని వాటర్‌ ప్లాంట్‌లో ఆరుగురు వలస కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశ్‌కి చెందినవారు కాగా, మరొకరు నేపాల్‌కి చెందిన వ్యక్తి. ఈ వివరాల్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఇన్‌ నజ్రాన్‌ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఈ ఘటనలో ప్లాంట్‌లోని కొంత భాగం కూడా దెబ్బ తింది. ఇరాన్‌ మద్దతుతో హౌతి మిలిటెంట్లు మిసైల్స్‌ మరియు షెల్లింగ్స్‌ని ప్రయోగిస్తున్నారు. ఏప్రిల్‌ 2015 నుంచి జరుగుతున్న ఇలాంటి ఘటనల్లో వందల మంది గాయాల పాలవుతున్నారు. యెమెన్‌ ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు మిసైల్స్‌ని బుధవారం సౌదీ అరేబియా దళాలు ధ్వంసం చేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com