నజ్రాన్లో ఆరుగురు వలసకార్మికులకు గాయాలు
- August 15, 2016
యెమెన్ నుంచి సంభవించిన పేలుళ్ళ కారణంగా, నజ్రాన్ ప్రాంతంలోని వాటర్ ప్లాంట్లో ఆరుగురు వలస కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశ్కి చెందినవారు కాగా, మరొకరు నేపాల్కి చెందిన వ్యక్తి. ఈ వివరాల్ని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఇన్ నజ్రాన్ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఈ ఘటనలో ప్లాంట్లోని కొంత భాగం కూడా దెబ్బ తింది. ఇరాన్ మద్దతుతో హౌతి మిలిటెంట్లు మిసైల్స్ మరియు షెల్లింగ్స్ని ప్రయోగిస్తున్నారు. ఏప్రిల్ 2015 నుంచి జరుగుతున్న ఇలాంటి ఘటనల్లో వందల మంది గాయాల పాలవుతున్నారు. యెమెన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు మిసైల్స్ని బుధవారం సౌదీ అరేబియా దళాలు ధ్వంసం చేశాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









