నజ్రాన్లో ఆరుగురు వలసకార్మికులకు గాయాలు
- August 15, 2016
యెమెన్ నుంచి సంభవించిన పేలుళ్ళ కారణంగా, నజ్రాన్ ప్రాంతంలోని వాటర్ ప్లాంట్లో ఆరుగురు వలస కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశ్కి చెందినవారు కాగా, మరొకరు నేపాల్కి చెందిన వ్యక్తి. ఈ వివరాల్ని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఇన్ నజ్రాన్ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఈ ఘటనలో ప్లాంట్లోని కొంత భాగం కూడా దెబ్బ తింది. ఇరాన్ మద్దతుతో హౌతి మిలిటెంట్లు మిసైల్స్ మరియు షెల్లింగ్స్ని ప్రయోగిస్తున్నారు. ఏప్రిల్ 2015 నుంచి జరుగుతున్న ఇలాంటి ఘటనల్లో వందల మంది గాయాల పాలవుతున్నారు. యెమెన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు మిసైల్స్ని బుధవారం సౌదీ అరేబియా దళాలు ధ్వంసం చేశాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







