ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- August 04, 2026
దోహా: ఖతార్ ప్రభుత్వం అద్దె చట్టంలో కీలక మార్పులు చేసింది. 2008 నాటి చట్టం నం. 4లో సవరణలు చేస్తూ 2026 నాటి చట్టం నం.8ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గెజిట్లో కొత్త నిబంధనలను ప్రకటించింది.కొత్త చట్టం ప్రకారం, ప్రతి నివాస, వాణిజ్య లేదా ఇతర యూనిట్కు సంబంధించిన లీజ్ ఒప్పందాన్ని నమోదు చేసుకునేందుకు QR250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అద్దెదారులు–ఇంటి యజమానుల మధ్య తలెత్తే అన్ని వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు రెంటల్ డిస్ప్యూట్స్ కమిటీకి ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఈ కమిటీ పరిధిలోకి వచ్చే వివాదాలపై నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు వీలు ఉండదు. ముందుగా కమిటీని సంప్రదించి, దాని నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే కోర్టులో అప్పీల్ చేయాలి. కమిటీ ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి ఉన్న పక్షాలు 15 రోజులలోపు కోర్ట్ ఆఫ్ అప్పీల్ ను ఆశ్రయించవచ్చు.
అలాగే, ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను వినియోగిస్తున్న లబ్ధిదారులు తమ ఒప్పందాల్లో అనుమతి ఉన్నట్లయితే, మూడో వ్యక్తులకు ఇచ్చే లీజ్ ఒప్పందాలను రెండు నెలల్లోపు తప్పనిసరిగా నమోదు చేయాలి. అయితే వీరికి QR250 రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
కొత్త నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా QR10,000 వరకు జరిమానా విధించనున్నారు. అయితే తుది తీర్పు వెలువడకముందే నిర్ణీత మొత్తం, వర్తించే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి కేసును రాజీ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని సంబంధిత అన్ని శాఖలకు ఖతార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







