ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- August 04, 2026
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలో మంగళవారం నిర్వహించిన ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మచిలీపట్టణం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో ఎంపీ బాలశౌరి సమావేశమయ్యారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఈ ఎన్డీఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశంలో పలువురు ఎన్డీఏ ఎంపీలు పాల్గొని, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ విధానాల అమలుపై అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్
- ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- కాంగోలో ఎబోలా వైరస్ కలకలం..1,700 మంది మృతి
- ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- 17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!
- ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం.. 9 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కేరళ ప్రవాసికి రూ.1.36 లక్షల పరిహారం
- కువైట్లో బ్యాంక్ కార్డుల వినియోగం జోరు..!!
- నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు
- గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో రియాద్కు చోటు..!!
- రష్యా, పాకిస్తాన్లో ఉగ్రదాడులను ఖండించిన బహ్రెయిన్..!!







