దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- August 06, 2026
దుబాయ్: సరిహద్దు ఈ-కామర్స్ (Cross-border E-commerce) లావాదేవీలను ప్రోత్సహిస్తూ, వ్యాపార వ్యయాలను తగ్గించేందుకు దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన నిబంధనల ప్రకారం Dh1,000 వరకు విలువ కలిగిన దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు కల్పించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చాయి.
అయితే ఈ మినహాయింపు పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ స్మోకింగ్ పరికరాలు, వాటి ఉపకరణాలు, నికోటిన్ కలిగిన ద్రవాలు, మద్యపాన పదార్థాలు, ఆల్కహాల్ కలిగిన ఆహార ఉత్పత్తులకు వర్తించదని దుబాయ్ కస్టమ్స్ స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రయోజనాలను పొందాలనుకునే కంపెనీలు తమ కార్యకలాపాలను తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించింది.
రిటర్న్ వస్తువులకు మరింత వెసులుబాటు
వ్యాపార సంస్థలకు మరో ముఖ్యమైన ఊరట కల్పిస్తూ, ఇప్పటికే కస్టమ్స్ సుంకం చెల్లించిన బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) వస్తువులను తిరిగి పంపే గడువును కూడా పెంచింది. ఇప్పటి నుంచి వస్తువులు ఎగుమతి చేసిన తేదీ నుంచి 60 రోజులలోపు తిరిగి వస్తే, వాటిపై మళ్లీ కస్టమ్స్ సుంకం విధించబోదని తెలిపింది.
ఈ-కామర్స్ రంగానికి ప్రోత్సాహం
దుబాయ్ కస్టమ్స్ ప్రకారం, ఈ మార్పులు వ్యాపార వాతావరణాన్ని మరింత పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఈ-కామర్స్ రంగంలో కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడం, అంతర్జాతీయ వాణిజ్య ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
యూఏఈలో ఈ-కామర్స్ వృద్ధి
2026 తొలి అర్ధభాగంలో గల్ఫ్ దేశాల్లో ఈ-కామర్స్ వృద్ధి మందగించినప్పటికీ, యూఏఈలో మాత్రం ఈ రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కాలంలో యూఏఈ ఈ-కామర్స్ మార్కెట్లో గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ (GMV) 2 శాతం పెరిగింది. దీర్ఘకాలంలో దేశ రిటైల్ మార్కెట్ 2033 నాటికి 145.3 బిలియన్ డాలర్ల నుంచి 227.1 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా సుంకం మినహాయింపు నిర్ణయం ఈ-కామర్స్ రంగానికి మరింత ఊతమివ్వనుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







