నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ ట్రాక్..!!
- August 09, 2026
మనామా: నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల పొడవైన వాకింగ్ వేను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు క్యాపిటల్ ట్రస్టీస్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుత సెషన్లో తవాసుల్ ప్లాట్ఫామ్ ద్వారా బోర్డుకు మొత్తం 1,203 వినతులు అందినట్లు డిప్యూటీ చైర్వుమన్ ఖులూద్ అల్ ఖత్తాన్ తెలిపారు. గవర్నరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాల్లో 185 ఫీల్డ్ విజిట్లు నిర్వహించినట్లు చెప్పారు. 223 వినతులపై తదుపరి చర్యలు చేపట్టడంతో పాటు సంబంధిత అధికారులకు 299 అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. బోర్డు పనితీరులో క్షేత్రస్థాయి పర్యటనలు కీలకంగా మారాయని అల్ ఖత్తాన్ తెలిపారు.
కేంద్ర మార్కెట్ల అభివృద్ధి, పబ్లిక్ పార్కుల నిర్వహణ, ఆధునీకరణ, మౌలిక వసతుల మెరుగుదల, పార్కింగ్ కొరత పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, పట్టణ సుస్థిరత వంటి అంశాలకు బోర్డు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. జుఫైర్ ప్రాంతంలో 120 కొత్త పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు 43 పబ్లిక్ పార్కుల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమంలో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. రాజధానిలోని పాత సౌక్ పునరాభివృద్ధి పనులతో పాటు సిత్రా, జిధాఫ్స్లోని కేంద్ర మార్కెట్ల అభివృద్ధిపైనా బోర్డు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు రాజధాని పట్టణ ప్రత్యేకతను, చారిత్రక గుర్తింపును కాపాడేందుకు దోహదపడతాయని తెలిపారు.
కింగ్ ఫైసల్ కార్నిష్ వరకు విస్తరించే వాటర్ఫ్రంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ వే నిర్మాణం కూడా ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో ఉన్నట్లు అల్ ఖత్తాన్ వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో బోర్డు తన పర్యవేక్షణ, సేవా బాధ్యతలను కొనసాగిస్తోందని అన్నారు. గవర్నరేట్ ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపల్ సేవలను అభివృద్ధి చేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, బహ్రెయిన్ విజన్ 2030కు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు అల్ ఖత్తాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!
- కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీలో ఆన్లైన్ వేధింపులపై చర్చ..!!
- ఖతార్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు QR333 మిలియన్లు..!!
- నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ ట్రాక్..!!
- కువైట్లో KD3,000 దాటితే బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరి..!!
- అర్హత ఉన్న భారతీయులందరికీ 10 ఏళ్ల పాస్పోర్టు..!!
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్







