డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- August 12, 2026
దోహా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో వ్యక్తులను అనుకరిస్తూ రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఇతర కృత్రిమ కంటెంట్పై ఖతర్ హోంశాఖ (MoI) ప్రజలను అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన హెచ్చరికలో డిజిటల్ భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేసింది. AI ఆధారిత మోసాలకు ప్రజలు బలికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. “మీరు చూసినదంతా, విన్నదంతా నిజం కాదు” అని హోంశాఖ పేర్కొంది.
డీప్ఫేక్ల బారిన పడకుండా ప్రజలు ఆన్లైన్లో కనిపించే కంటెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ సూచించింది. ఏదైనా వీడియో, ఆడియో లేదా సమాచారాన్ని ఇతరులకు పంపే ముందు దాని మూలం, విశ్వసనీయతను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని తెలిపింది. సమాచారం నిజమని నిర్ధారణ కానంత వరకు దాన్ని నమ్మడం లేదా షేర్ చేయడం చేయొద్దని హెచ్చరించింది. AI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ను పరిశీలించి, దాని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించడం ద్వారా ప్రజలు మోసాల నుంచి రక్షించుకోవచ్చని హోంశాఖ పేర్కొంది.
మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఒక వ్యక్తి నిజంగా చెప్పని మాటలను చెప్పినట్లు, చేయని పనులను చేసినట్లు కనిపించేలా రూపొందించే కృత్రిమ వీడియోలు, ఆడియోలు, చిత్రాలు, ఇతర డిజిటల్ కంటెంట్ను డీప్ఫేక్లుగా పిలుస్తారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన AI సాంకేతికతతో వాయిస్ క్లోనింగ్, కృత్రిమ వీడియో కాల్స్, AI రూపొందించిన కంటెంట్ ద్వారా వ్యక్తుల గొంతు, మాట్లాడే విధానం, రూపాన్ని కూడా నమ్మశక్యం కాని రీతిలో అనుకరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- జెన్జీ ఎఫెక్ట్తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!







