అబుదాబి షాపింగ్ సెంటర్‌లో లులు గ్రూప్ ఉద్యోగులతో UAE అధ్యక్షుడి భేటీ

- August 12, 2026 , by Maagulf
అబుదాబి షాపింగ్ సెంటర్‌లో లులు గ్రూప్ ఉద్యోగులతో UAE అధ్యక్షుడి భేటీ

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబిలోని ఓ షాపింగ్ సెంటర్‌ను సందర్శించి లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ ఎంఏ యూసుఫలితో పాటు పలువురు ఉద్యోగులను కలిశారు.

ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు లులు గ్రూప్‌కు చెందిన వివిధ విభాగాలను సందర్శించారు. యూసుఫలి, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. షాపింగ్ సెంటర్‌లోని ఉద్యోగులు, వినియోగదారులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు.

యూఏఈ సమాజానికి సేవలందించడంలో లులు గ్రూప్ చేస్తున్న కృషి, చేపడుతున్న పలు కార్యక్రమాలను షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ప్రశంసించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగిస్తున్న లులు గ్రూప్ సేవలను ఆయన అభినందించారు.

అనంతరం ఉద్యోగులు, షాపింగ్ సెంటర్‌కు వచ్చిన వినియోగదారులు యూఏఈ అధ్యక్షుడితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆయనను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లభించడం పట్ల ఉద్యోగులు, సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com