ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- August 13, 2026
తఖా: ధోఫార్ గవర్నరేట్లో వారం రోజుల పాటు నిర్వహించనున్న ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ, హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవంలో భాగంగా ఆకాశంలో నిర్వహించిన వివిధ విన్యాసాలు సందర్శకులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్యారాగ్లైడింగ్, గాలిపటాల ఎగరవేత, డ్రోన్ ప్రదర్శనలు వంటి పలు ఎయిర్ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించారు.
ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ అహ్మద్ అల్ అలావీ మాట్లాడుతూ.. ఎయిర్ స్పోర్ట్స్ను సమాజ సంస్కృతిలో ఒక భాగంగా మార్చడంతో పాటు ధోఫార్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఏడాది ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్లో సందర్శకులు, పర్యాటకులు వర్చువల్ రియాలిటీ (VR) సాంకేతికత ద్వారా విమానయాన అనుభూతిని పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవం ముగింపు సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ప్రతినిధులను తఖా వాలి షేక్ తారిఖ్ ఖాలిద్ అల్ హినాయ్ సత్కరించారు. ఎయిర్ స్పోర్ట్స్, పర్యాటక రంగాల అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







