ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- August 16, 2026
మనామా: హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న యూఏఈకి చెందిన ADNOC సంస్థకు అనుబంధమైన వాణిజ్య నౌక పై ఇరాన్ జరిపిన దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాలపై (UNCLOS), అలాగే ఐరాస భద్రతా మండలి తీర్మానం 2817కు స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొంది.
బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసినట్లు బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) తెలిపింది. యూఏఈ తన సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వం, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తీసుకునే అన్ని చర్యలకు బహ్రెయిన్ పూర్తి సంఘీభావం ప్రకటించింది.
యూఏఈ భద్రతే బహ్రెయిన్ భద్రతలో అంతర్భాగమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో యూఏఈకి అండగా నిలుస్తామని తెలిపింది.
హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రత, స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తన బాధ్యతలను నిర్వర్తించాలని బహ్రెయిన్ కోరింది. సముద్ర దోపిడీని అడ్డుకునేందుకు, వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లపై జరుగుతున్న దాడులను ఇరాన్ తక్షణమే నిలిపివేసేలా నిరోధక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అదేవిధంగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా, ఎలాంటి షరతులు లేకుండా తిరిగి తెరవాలని బహ్రెయిన్ కోరింది. ఈ కీలక సముద్ర మార్గం పునరుద్ధరణ ద్వారా ప్రాంతీయ భద్రత, స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన భద్రత, ఆహార సరఫరాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్ల భద్రతకు ముప్పు ఏర్పడటం అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో బహ్రెయిన్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







