భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- August 15, 2026
షార్జా: భార్యతో ఉన్న కుటుంబ విభేదాల కారణంగా ఓ వ్యక్తి మరో మహిళను తన భార్యగా పొరబడి ఆమెపై దాడి చేసిన ఘటన షార్జాలో చోటుచేసుకుంది. ఈ కేసులో ఆసియా దేశానికి చెందిన వ్యక్తిపై షార్జా మిస్డిమీనర్స్ కోర్టులో విచారణ కొనసాగుతోంది.
కోర్టులో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన పిల్లలతో కలిసి రోడ్డుపై వెళ్తుండగా నిందితుడు ఆమె వద్దకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. అతడు మాట్లాడిన మాటలు తనకు అర్థం కాలేదని ఆమె తెలిపింది. కొద్దిసేపటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పిల్లలతో కలిసి సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లి ఆశ్రయం పొందింది.
అయితే నిందితుడు ఆమెను వెంబడిస్తూ దుకాణంలోకి వచ్చి దూషించడంతో పాటు పిల్లల ఎదుటే తన మెడ పట్టుకుని దాడి చేశాడని మహిళ కోర్టుకు తెలిపింది. ఈ ఘటనను చూసిన తన పిల్లలు తీవ్రంగా భయపడిపోయారని పేర్కొంది.
భార్యగా భావించి పొరపాటు
తనపై వచ్చిన ఆరోపణలను నిందితుడు పూర్తిగా ఖండించలేదు. బాధితురాలు తన భార్యను పోలి ఉండటంతో ఆమెను భార్యగానే భావించి దాడికి పాల్పడ్డానని కోర్టుకు తెలిపాడు. భార్యతో కొన్ని రోజులుగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయని, ఈ క్రమంలో రోడ్డుపై కనిపించిన మహిళ తన భార్యేనని పొరబడ్డానని చెప్పాడు.
అయితే బాధితురాలు మాత్రం నిందితుడిని గతంలో ఎప్పుడూ కలవలేదని, అతడితో తనకు ఎలాంటి పరిచయం లేదా సంబంధం లేదని స్పష్టం చేసింది. తనపై ఎందుకు దాడి చేశాడో కూడా తనకు తెలియదని పేర్కొంది.
ఈ కేసులో అదనపు సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉండటంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. బాధితురాలిని మరోసారి కోర్టుకు హాజరుకావాలని, అలాగే సాక్షులను కూడా విచారణకు పిలవాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







