వక్కంత వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ..
- August 17, 2016
ఎన్టీఆర్ తన చిత్రాల వేగాన్ని పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'నాన్నకు ప్రేమతో' అంటూ అభిమానులను పలకరించగా, తాజాగా సెప్టెంబర్ 2న 'జనతా గ్యారేజ్'తో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇక రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్లో ప్రారంభంకానుందట. వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ పచ్చజెండా వూపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తికావచ్చాయని సమాచారం. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన అశోక్, వూసరవెల్లి, టెంపర్ చిత్రాలకు వంశీనే రచయితగా పనిచేశారు. తాజా చిత్రాన్ని ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









