'పంచతంత్రం' సీక్వెల్
- August 17, 2016
కమల్హాసన్ నటించిన 'పంచతంత్రం' సినిమా గుర్తుందా? కమల్ అతని నలుగురు స్నేహతులు కలిసి చేసే అల్లరితో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రమది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతుందట.
కమల్హాసన్.. సిమ్రాన్.. రమ్యకృష్ణ నటించిన 'పంచతంత్రం' 2002లో విడుదలై ఘన విజయం సాధించింది. . ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని కె.ఎస్ రవికుమార్ చాలాసార్లు భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది నిర్మాణ దశకు చేరుకోలేదు. తాజాగా 'పంచతంత్రం' చిత్రానికి సీక్వెల్ తీయనున్నట్టు రవికుమార్ ప్రకటించారు.
కమల్ హాసనే స్వయంగా ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సింగిల్లైన్ కథను చెప్పారట. త్వరలో స్క్రిప్టు పూర్తి చేసి సెట్స్పైకి తీసుకెళ్తారట. మొదటి చిత్రంలో కమల్.. అతని స్నేహితులు వారి భార్యలకు తెలియకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సీక్వెల్లో కథంతా ఈ ఐదుగురు భర్తలపై ప్రతీకారం తీర్చుకునే భార్యల చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు.
మరి ఈ చిత్రంలో కమల్ సరసన ఎవరు నటిస్తారు? స్నేహితులుగా.. వారి భార్యలుగా మొదటి చిత్రంలో ఉన్నవాళ్లనే కొనసాగిస్తారా? మార్పులు చేస్తారా.. అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







